త్వరలోనే తెలంగాణ ఎమ్మెల్యేలకు నోటీసులు..

- April 05, 2021 , by Maagulf
త్వరలోనే తెలంగాణ ఎమ్మెల్యేలకు నోటీసులు..

బెంగళూరు:బెంగళూరులో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో హైదరాబాద్‌ లింక్‌లు సంచలనం రేపుతున్నాయి...బెంగళూరులో కొద్దిరోజుల క్రితం పట్టుబడిన నైజీరియ‌న్స్‌ ను విచారిస్తున్న సమయంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.క‌న్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాత శంక‌ర్ గౌడ్‌తో క‌లిసి క‌ల‌హ‌ర్ రెడ్డి, సందీప్.. డ్రగ్స్ దందా సాగించినట్లు సమాచారం.బెంగళూరులో ఉన్న పబ్‌లు,హోటళ్లకు హైదరాబాద్‌కు చెందిన సందీప్, కలహర్ రెడ్డి అనే వ్యాపారవేత్తలు డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా గుర్తించారు.. ఇక, ఈ కేసులో ఎమ్మెల్యేల పేర్లు కూడా ప్రచారంలో ఉండగా.. ఎమ్మెల్యేల ఆర్డర్ మేరకు కొకైన్‌ను చాలా సార్లు పంపినట్టు కూడా పోలీసుల విచారణలో సందీప్ బయటపెట్టినట్టుగా చెబుతున్నారు. అంతే కాదు.. తెలంగాణలో చాలా మంది ప్రముఖులకు కూడా ఈ గ్యాంగ్ డ్రగ్స్ సరఫరా చేసినట్టు, చేస్తున్నట్టు విచారణలో వెలుగులోకి వచ్చింది.కలహార్ రెడ్డి, శంకర్ గౌడ్‌తో పాటు తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలను కూడా విచారిస్తారని తెలుస్తోంది.బెంగళూరు పోలీసులు త్వరలోనే సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వనున్నట్టుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి.. ఇక, ఈ కేసులో ఇవాళ కలహార్‌రెడ్డి,రతన్‌రెడ్డి పోలీసులు ప్రశ్నించనున్నారు.మొత్తంగా.. ఈ కేసులో ఎమ్మెల్యేల లింక్‌లు సంచలనంగా మారాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com