కరోనా తీవ్రత: నేటి రాత్రి నుంచి షిరిడీలో సాయి ఆలయం మూసివేత
- April 05, 2021మహారాష్ట్రలోని షిర్డీలోని సాయిబాబా ఆలయం ఈరోజు రాత్రి 8 గంటల తర్వాత మూసివేయబడుతుంది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆలయం మూసివేసే ఉండనుంది. సాయిబాబా ఆలయంతో పాటు, 'ప్రసాదాలయ', 'భక్త నివాస్' కూడా మూసివేయబడతాయని తెలుస్తోంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పాక్షిక లాక్ డౌన్ ప్రకటించిన క్రమంలో తర్వాత షిర్డీ ఆలయ పరిపాలన విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మాదిరిగానే తీవ్రమైన ఆంక్షలు విధించాలని రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం నిర్ణయించింది. ఈ పరిమితులు ఏప్రిల్ 30 వరకు ఉంటాయి అని చెబుతున్నారు. అలాగే, వారాంతపు లాక్ డౌన్లు కూడా రాష్ట్రం అంతా అమల్లోకి వస్తాయి. ఇక ఆ రోజుల్లో 144 సెక్షన్ రోజంతా విధించబడుతుంది. మామూలు రోజుల్లో కూడా రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల మధ్య సరైన కారణం లేకుండా పౌరులు తమ ఇంటిని వదిలి వెళ్ళలేరు. ఈ కర్ఫ్యూ నిబంధనల నుంచి అవసరమైన సేవలు మాత్రమే మినహాయించారు.
తాజా వార్తలు
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం