తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

- April 06, 2021 , by Maagulf
తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను విడుదల చేసింది.ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 1498 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,14,735కి చేరింది.ఇందులో 3,03,013 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9993 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఆరుగురు కరోనాతో మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1729కి చేరింది.కరోనా బులెటిన్ ప్రకారం నిన్నటి రోజున 245 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  

--హరి (మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com