మూమెంట్ బ్యాన్ ఎత్తివేత, రాత్రి వేళ కొనసాగనున్న ఆంక్షలు

- April 06, 2021 , by Maagulf
మూమెంట్ బ్యాన్ ఎత్తివేత, రాత్రి వేళ కొనసాగనున్న ఆంక్షలు

మస్కట్: రాత్రి 8 గంటల లోపు ప్రజల కదలికలపై ఎలాంటి నిషేధం లేదు. ఏప్రిల్ 8 నుంచి ఇది అమల్లోకి రానుంది. సుప్రీం కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. స్థానికులు, వలసదారులకు ఇది ఎంతో ఉపశమనం కలిగించనుంది.అయితే, రాత్రి వేళల్లో కమర్షియల్ యాక్టివిటీస్ విషయంలో మాత్రం ఆంక్షలు కొనసాగుతాయి. ఏప్రిల్ 8 మధ్యాహ్నం నుంచి విమానాశ్రయాల ద్వారా వచ్చే పౌరులు అలాగే రెసిడెంట్ కార్డు కలిగినవారికి ప్రవేశం కల్పిస్తారు. రమదాన్ మాసంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు కమర్షియల్ యాక్టివిటీస్ కోసం ఎలాంటి అనుమతీ వుండదు. 

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com