జవాన్ పార్ధీవ దేహాన్ని మోసిన సిపి వి.సి సజ్జనార్

- April 06, 2021 , by Maagulf
జవాన్ పార్ధీవ దేహాన్ని మోసిన సిపి వి.సి సజ్జనార్

హైదరాబాద్:ఛత్తీస్‌గడ్‌లోని బీజూపూర్‌ మావోయిస్టుల దాడిలో అసువులు బాసిన గుంటూరు జిల్లాకు చెందిన జవాన్ శాఖమూరి మురళీకృష్ణ భౌతిక కాయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సందర్బంగా మురళీ కృష్ణ పార్ధీవ దేహానికి CRPF అసిస్టెంట్ కమాండెంట్ విక్రమ్ సింగ్, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ లు ఘన నివాళులు అర్పించారు. కమిషనర్ సజ్జనార్ స్వయంగా జవాన్ పార్ధీవ దేహాన్ని మోశారు. సైనిక వందనం అనంతరం మురళీకృష్ణ భౌతిక కాయాన్ని రోడ్డుమార్గం ద్వారా గుంటూరుకు తరలించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com