ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూ

- April 06, 2021 , by Maagulf
ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూ

న్యూ ఢిల్లీ:ఢిల్లీలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.కరోనా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈరోజు నుంచి ఢిల్లీలో రాత్రి  కర్ఫ్యూ విధిస్తు నిర్ణయం తీసుకుంది.రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.ఈరోజు నుంచి ఏప్రిల్ 30 వ తేదీ వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.ఈరోజు బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 96వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.ఇక మహారాష్ట్రలో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.రాత్రి  కర్ఫ్యూతో పాటుగా ఉదయం 144 సెక్షన్ సీఆర్పీసి, వీకెండ్స్ లో లాక్ డౌన్ కూడా మహారాష్ట్రలో అమలు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com