ఫేస్బుక్ అధినేత వ్యక్తిగత వివరాలు లీక్
- April 06, 2021
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్లో మరోసారి హ్యాకింగ్కు గురి కావడం ఆందోళన రేపిన సంగతి తెలిసిందే. అయితే అతిపెద్ద డేటా బ్రీచ్గా చెబుతున్న తాజా కేసులో ఏకంగా ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఫోన్ నంబర్ కూడా లీక్ కావడం గమనార్హం. మార్క్ జుకర్బర్గ్ సిగ్నల్ యాప్ను వినియోగిస్తున్నారనీ, ఆయన ఫోన్ నంబర్ ఆన్లైన్లో లీక్ అయిందని భద్రతా పరిశోధకుడు వెల్లడించారు. అలాగే 533 మిలియన్ల ఫేస్బుక్ వినియోగుదారుల వ్యక్తిగత వివరాలు లీకైనట్టు తెలిపారు. ఈ 533 మిలియన్ల మందిలో 60లక్షలమంది భారతీయ వినియోగదారులున్నారు. అమెరికాకు చెందిన వారు 32 మిలియన్లు, 11 మిలియన్ల యూజర్లు యూకేకు చెందినవారున్నారు. ఈ ఫోన్ నంబర్ల డేటాబేస్ హ్యాకర్ల ఫోరమ్లో పోస్ట్ చేసినట్టు నివేదించిన సంగతి తెలిసిందే. డేటా లీక్కు ప్రభావితమైన వారిలో ఫేస్బుక్ సహ వ్యవస్థాపకులు డస్టిన్ మోస్కోవిట్జ్ , క్రిస్ హ్యూస్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
భద్రతా నిపుణుడు డేవ్ వాకర్ అందించిన సమాచారం ప్రకారం జుకర్ పేరు, పుట్టిన తేదీ, వివాహం, ఫేస్బుక్ యూజర్ ఐడీ తదితర వివరాలన్నీ లీక్ అయ్యాయి. అలాగే జుకర్బర్గ్ లీకైన ఫోన్ నంబర్ స్క్రీన్ షాట్తో పాటు" మార్క్ జుకర్బర్గ్ సిగ్నల్లోఖాతా ఉందంటూ ట్విట్ చేశారు. మరొక భద్రతా నిపుణుడు అలోన్ గాల్ ప్రకారం, ఫేస్బుక్ ఖాతాకు లింక్ చేయబడిన ఫోన్ నెంబర్ల ద్వారా ఈ హ్యాకింగ్ గత జనవరిలోనే జరిగిందన్నారు. దీనిపై స్పందించిన ఫేస్బుక్ ఇదంతా పాత డేటా అని కొట్టిపారేసింది. 2019 ఆగస్టులో ఈ లోపాన్ని సరిదిద్దామని పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







