యూఏఈలో త్వరలోనే ఎలక్ట్రానిక్ నోటరీ విధానం
- April 06, 2021
యూఏఈ:నకిలీ నోటరీలతో మోసాలకు పాల్పడకుండా త్వరలోనే ఎలక్ట్రానిక్ నోటరీ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు యూఏఈ న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అన్ని నోటరీలపై తప్పనిసరిగా బార్ కోడ్ ఉంటుందని.. ఆ బార్ కోడ్ ద్వారా నకిలీ నోటరీలను, నకిలీ ఏజెన్సీలను వెంటనే గుర్తించేందుకు వీలుంటుందని వెల్లడించింది. ఈ విధానాన్ని అతి త్వరలోనే అమలులోకి తీసుకురానున్నట్లు ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ స్పష్టం చేసింది. దీంతో ఎవరైనా ఏజెంట్ పవర్ ఆఫ్ ఆటార్నీని దుర్వినియోగం చేస్తూ ఆస్తులను అక్రమంగా అమ్మాలని ప్రయత్నిస్తే వారిని వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుందని ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ వెల్లడించింది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







