ఆంబులెన్స్ నుంచి మొబైల్ ఫోన్ చోరీ..ఇద్దరు అరెస్ట్
- April 06, 2021
సౌదీ:ఓవైపు ఆపదలో ఆదుకునేందుకు ప్రయత్నాలు జరుగుతుంటే..మరోవైపు సందట్లో సడేమియాలా ఇద్దరు వ్యక్తులు చేతివాటం చూపించారు. ఏకంగా ఆంబులెన్స్ లో నుంచి మొబైల్ ఫోన్ ను దొంగిలించారు. సౌదీ అరేబియాలోని తబుక్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆంబులెన్స్ లోని వైద్య సిబ్బంది ఆపదలో ఉన్న ఓ వ్యక్తికి చికిత్స చేసే పనిలో నిమగ్నమైపోయారు. ఇదే అదనుగా భావించిన ఇద్దరు వ్యక్తులు ఆంబులెన్స్ నుంచి మొబైల్ చోరీ చేశారు. అయితే..వారి బాగోతం సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అవటంతో ఆ ఇద్దరు వ్యక్తుల బండారం బయటపడింది. పూటేజ్ ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులు ఇద్దరి వయసు 30 ఏళ్లు ఉంటాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







