ఆంబులెన్స్ నుంచి మొబైల్ ఫోన్ చోరీ..ఇద్దరు అరెస్ట్
- April 06, 2021
సౌదీ:ఓవైపు ఆపదలో ఆదుకునేందుకు ప్రయత్నాలు జరుగుతుంటే..మరోవైపు సందట్లో సడేమియాలా ఇద్దరు వ్యక్తులు చేతివాటం చూపించారు. ఏకంగా ఆంబులెన్స్ లో నుంచి మొబైల్ ఫోన్ ను దొంగిలించారు. సౌదీ అరేబియాలోని తబుక్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆంబులెన్స్ లోని వైద్య సిబ్బంది ఆపదలో ఉన్న ఓ వ్యక్తికి చికిత్స చేసే పనిలో నిమగ్నమైపోయారు. ఇదే అదనుగా భావించిన ఇద్దరు వ్యక్తులు ఆంబులెన్స్ నుంచి మొబైల్ చోరీ చేశారు. అయితే..వారి బాగోతం సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అవటంతో ఆ ఇద్దరు వ్యక్తుల బండారం బయటపడింది. పూటేజ్ ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులు ఇద్దరి వయసు 30 ఏళ్లు ఉంటాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







