తెలంగాణలో లాక్ డౌన్ పై క్లారిటీ !
- April 07, 2021హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయని వైద్యారోగ్య శాఖా మంత్రి ఈటల పేర్కొన్నారు.మహారాష్ట్ర నుంచి తెలంగాణకు పెద్ద ఎత్తున రాకపోకలు జరుగుతున్నాయని, అందువల్ల కేసులు పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఎక్కువ మంది అసిమ్టమాటిక్ గా ఉంటున్నారని, తెలంగాణలో వాక్సినేషన్ వేగవంతం చేసేందుకు.. ప్రతి రోజు లక్ష మందికి వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అన్ని ఆస్పత్రుల్లో కోవిడ్ నాన్ కోవిడ్ సేవలు అందుతాయని, ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కరోనా ట్రీట్మెంట్ కోసం ప్రత్యేక పడకలు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు వ్యాపార కోణంలో కరోనా చికిత్స ను చూడొద్దని కోరారు. మాస్కులు తప్పకుండా ధరించాలని కోరిన ఆయన ఇంకా కొన్ని రోజులు సెకండ్ వేవ్ ప్రభావం ఉంటుంది అని, అయితే లాక్ డౌన్ , కర్ఫ్యూ లు ఉండవని అన్నారు. పబ్ , క్లబ్బుల్లో కరోనా జాగ్రత్తలు పాటించాలని ఈటల పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!