కర్ఫ్యూ నుంచి దోబీ షాపుల మినహాయింపు ఇవ్వాలని ఓనర్ల వినతి
- April 08, 2021కువైట్ సిటీ:కోవిడ్ సంక్షోభంతో ఇప్పటికే ఆర్ధికంగా చితికిపోయిన తమకు కర్ఫ్యూ నిబంధనలు మరింత ఆర్ధికంగా చిదిమేస్తున్నాయని కువైతీ లాండరీ షాపు ఓనర్ల ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తమకు కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కరోనా ఎమర్జెన్సీ కమిటీకి లేఖ రాసింది. తాము అన్ని కోవిడ్ నిబంధనలు పాటించి షాపులను నిర్వహించుకుంటామని, ప్రజల ఆరోగ్య భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరించబోమంటూ ఆ లేఖలో ఫెడరేషన్ స్పష్టం చేసింది. కోవిడ్ రేపిన ఆర్ధిక దుమారంలో ఇప్పటికే చాలా మంది లాండరీ ఓనర్లు షాపులు మూసేసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ప్రభుత్వం తమ పట్ల ఉదారంగా ఆలోంచాల్సిన అవసరం ఉందని వేడుకున్నారు. తమ ఫెడరేషన్ లో 3000 లాండరీ షాపులు ఉటే కొవిడ్ సంక్షోభ కాలంలో 50 షాపులు పూర్తిగా మూతపడ్డాయని, సిబ్బందికి జీతాలు చెల్లించలేక 400 లాండరీ షాపులను తాత్కాలికంగా మూసివేశారని ఫెడరేషన్ మెంబర్స్ ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం