కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న ప్రధాని మోదీ
- April 08, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ డ్రైవ్ను ప్రభుత్వం వేగవంతం చేసింది.ప్రస్తుతం 45 ఏళ్లు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ కరోనా రెండో డోస్ తీసుకున్నారు.ఢిల్లీల ఎయిమ్స్లో కోవాగ్జిన్ రెండో డోసు వేయించుకున్నారు. ప్రధాని మోడీకి పంజాబ్కు చెందిన నర్సు నిషా శర్మ వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ వేసుకున్న విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కరోనా వైరస్ను నిర్మూలించేందుకు ఉన్న మార్గాల్లో వ్యాక్సిన్ కూడా ఒకటని ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్కు అర్హులైన వారంతా టీకా వేసుకోవాలని.. అందుకోసం కోవిడ్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచనలు చేశారు ప్రధాని మోదీ. కాగా...ప్రధాని మోదీ మొదటి డోస్ను గత నెల 1న వేయించుకున్నారు. రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైన రోజే ఆయన వ్యాక్సిన్ తీసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







