కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న ప్రధాని మోదీ
- April 08, 2021న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ డ్రైవ్ను ప్రభుత్వం వేగవంతం చేసింది.ప్రస్తుతం 45 ఏళ్లు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ కరోనా రెండో డోస్ తీసుకున్నారు.ఢిల్లీల ఎయిమ్స్లో కోవాగ్జిన్ రెండో డోసు వేయించుకున్నారు. ప్రధాని మోడీకి పంజాబ్కు చెందిన నర్సు నిషా శర్మ వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ వేసుకున్న విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కరోనా వైరస్ను నిర్మూలించేందుకు ఉన్న మార్గాల్లో వ్యాక్సిన్ కూడా ఒకటని ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్కు అర్హులైన వారంతా టీకా వేసుకోవాలని.. అందుకోసం కోవిడ్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచనలు చేశారు ప్రధాని మోదీ. కాగా...ప్రధాని మోదీ మొదటి డోస్ను గత నెల 1న వేయించుకున్నారు. రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైన రోజే ఆయన వ్యాక్సిన్ తీసుకున్నారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి