ఫేస్ ఐడీతో ప్రభుత్వ సేవలు...ప్రపంచంలోనే తొలిసారిగా యూఏఈలో అమలు
- April 08, 2021
యూఏఈ: సాంకేతికంగా ప్రపంచ దేశాలతో పోటీ పడేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఒరవడిని అడాప్ట్ చేసుకుంటున్న యూఏఈ ప్రభుత్వం ఇప్పుడు మరో టెక్నాలజీని యూఏఈ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి ప్రభత్వ కార్యాలయాలకు రాకుండా ప్రజలు ఇంటి నుంచే పలు దరఖాస్తులు, పాసులు, ఇతర ప్రభుత్వ సేవలు పొందెందుకు వీలుగా బయోమెట్రిక్, ఫింగర్ ప్రింట్స్ రికగ్నైజేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే ఆధార్ కార్డులో ఐరిష్ విధానంతో దీన్ని పోల్చి చెప్పవచ్చు. ముందుగా అందరి వివరాలను సేకరించి సర్వర్ క్రోడికరిస్తారు. ఎవరైన దరఖాస్తుదారుడు ఏదైన ప్రభుత్వ సేవలు పొందెందుకు అప్లికేషన్ పెట్టుకోవాలంటే అతను వెబ్ కామ్ ముందు కూర్చుంటే సరిపోతుంది. బయోమెట్రిక్ ఫేస్, ఫింగర్ ప్రింట్స్ రికగ్నైజేషన్ తో అతని వివరాలు పూర్తిగా డిజిటల్ పరంగా నమోదవుతాయి. అతని అప్లికేషన్ నమోదు చేయబడుతుంది. ప్రపంచ దేశాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నతొలి దేశంగా యూఏఈ ఘనత సాధించటం విశేషం. ఇదిలాఉంటే యూఏఈలోని దుబాయ్ పరిధిలో ఈ బయోమెట్రిక్ ఫేస్ రికగ్నైజేషన్ విధానం తొలిగా అమలులోకి రానుంది. బయోమెట్రిక్ ఫేస్ రికగ్నైజేషన్ కు సంబంధించి దుబాయ్ రూలర్ ప్రకటన విడుదుల చేసిన రెండు నెలల లోపే ఈ విధానం ప్రజలకు అందుబాటులోకి రావటం మరో విశేషం.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







