తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

- April 10, 2021 , by Maagulf
తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.నిన్నటి వరకు 2 వేయిలోపే నమోదవుతున్న కేసులు ఇవాళ 3 వేలకు చేరువలో నమోదయ్యాయి.తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను విడుదల చేసింది.ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 2909 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,24,091కి చేరింది.ఇందులో 3,04,548 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 17,791 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఆరుగురు కరోనాతో మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1752కి చేరింది.కరోనా బులెటిన్ ప్రకారం నిన్నటి రోజున 584 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం 11,495 మంది ఐసోలేషన్‌ ఉన్నారు. 

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com