భారత్ లో కరోనా కేసుల వివరాలు

- April 10, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్ లో మహమ్మారి విలయతాండవం చేస్తున్నది.రోజువారీ పాజిటివ్ కేసులు లక్షకు పైగా నమోదవుతున్నాయి.తాజాగా దేశంలో 1,45,384 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,32,05,926కి చేరింది.ఇందులో 1,19,90,859 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 10,46,631 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 794 మంది ప్రాణాలు కోల్పోయారు.  దీంతో భారత్ లో ఇప్పటి వరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,68,436కి చేరింది.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 77,567 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు.దేశంలో ఇప్పటి వరకు మొత్తం 9,80,75,150 మందికి వ్యాక్సిన్ అందించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com