హైదరాబాద్లో నాలుగు కొత్త కోవిడ్ కేంద్రాలు
- April 10, 2021
హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో నాలుగు కరోనా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది.ఇందుకోసం రూ.1.79 కోట్లను కూడా విడుదల చేయాలని నిర్ణయించింది. జాతీయ ఆరోగ్య మిషన్కు చెందిన నిధులను ఈ అవసరాల కోసం ఖర్చు చేసేలా.. హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కేంద్రాలు నగరంలోని ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రి, బేగంపేటలోని నేచర్ క్యూర్ ఆసుపత్రి, చార్మినార్లోని నిజామియా టిబ్బి ఆసుపత్రి, మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రులను కరోనా కేర్ సెంటర్లుగా మారుస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జాతీయ హెల్త్ మిషన్ ద్వారా వచ్చే రూ.1.79 కోట్లను తక్షణం పారిశుధ్యం, సెక్యూరిటీ, లాండ్రీ, బయో వ్యర్థాల నిర్వహణ, కరోనా పేషెంట్ల ఆహారపు అవసరాలకు ఖర్చు చేయాలని రిజ్వి స్పష్టం చేశారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం









