రాజ‌ద్రోహానికి పాల్ప‌డిన ముగ్గురు సైనికుల‌కు ఉరి

- April 11, 2021 , by Maagulf
రాజ‌ద్రోహానికి పాల్ప‌డిన ముగ్గురు సైనికుల‌కు ఉరి

సౌదీ: అధిక రాజద్రోహానికి పాల్పడినందుకు ముగ్గురు సైనికులను ఉరితీసినట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉరి తీయ‌బ‌డిని ముగ్గురు సైనికులు  ముహమ్మద్ బిన్ అహ్మద్ బిన్ యాహ్యా అకామ్, షాహెర్ బిన్ ఇసా బిన్ ఖాసిం హక్కావి, మరియు హమౌద్ బిన్ ఇబ్రహీం బిన్ అలీ హజ్మి అని వారి వివ‌రాలు వెల్ల‌డించింది. రాజ్యం ఉనికిని, దాని సైనిక ప్రయోజనాలను ఉల్లంఘించే విధంగా శత్రువులతో సహకరిస్తూ రాజద్రోహ నేరానికి పాల్పడినట్లు దర్యాప్తు వెల్లడైంద‌ని...కోర్టులోనూ వారిపై ఆరోప‌ణ‌లు రుజువు అయిన‌ట్లు పేర్కొంది. రాజ శాస‌నం మేర‌కు వారిని ఉరి తీసినట్లు ప్ర‌క‌టించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com