సివిల్ ఐడీ కార్డుల జారీ సమయాన్ని ప్రకటించిన పీఏసీఐ
- April 14, 2021
కువైట్ సిటీ: రమదాన్ మాసం పురస్కరించుకొని అధికారిక పని గంటలను ప్రకటించిన కువైట్...సివిల్ ఐడీ కార్డుల జారీకి సంబంధించి కూడా స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు సివిల్ ఐడి కార్డులను సేకరించే సమయాన్ని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పిఎసిఐ) ప్రకటించింది. సౌత్ సుర్రాలోని ప్రధాన కార్యాలయంలో ఉదయం 10 నుండి సాయంత్రం 4:30 వరకు ఐడీ కార్డులను పొందవచ్చని స్పష్టం చేసింది. అయితే. జహ్రా, అహ్మదీ శాఖలలో మాత్రం మధ్యాహ్నం 1:30 గంటల వరకే సేవలు అందుబాటులో ఉంటాయి. ఇదిలాఉంటే పరిపాలనా నిర్వహణ భవనంలో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేస్తాయి. ఇక పౌరుల రిసెప్షన్ హాల్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు విధులు ముగుస్తాయి. ప్రవాసులు మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు సందర్శించేందుకు అనుమతిస్తారు.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







