కార్మికుడిని కత్తితో బెదిరించి దోచుకున్న నలుగురు అరెస్ట్
- April 14, 2021సౌదీ: పోలీసుల మని చెప్పి ఓ కార్మికుడి ఇంట్లోకి వెళ్లి మరీ దోచుకున్న నలుగురు వ్యక్తులను సౌదీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు నలుగురిలో ముగ్గురు సౌదీ పౌరులు కాగా..మరొకరు యెమన్ కు చెందిన వ్యక్తి. నిందితులు నలుగురు 30 ఏళ్ల వయసువారేనని పోలీసులు వెల్లడించారు. ఈ నలుగురు కలిసి తాము పోలీసులమని చెప్పి కార్మికుడి ఇంట్లోకి చొరబడ్డారని..ఆ తర్వాత కత్తులతో బెదరించి ఇంట్లో వస్తువులను దోచుకెళ్లిన్నట్లు వివరించారు. చోరీకి పాల్పడిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం