కార్మికుడిని క‌త్తితో బెదిరించి దోచుకున్న న‌లుగురు అరెస్ట్

- April 14, 2021 , by Maagulf
కార్మికుడిని క‌త్తితో బెదిరించి దోచుకున్న న‌లుగురు అరెస్ట్

సౌదీ: పోలీసుల మ‌ని చెప్పి ఓ కార్మికుడి ఇంట్లోకి వెళ్లి మ‌రీ దోచుకున్న న‌లుగురు వ్య‌క్తుల‌ను సౌదీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు న‌లుగురిలో ముగ్గురు సౌదీ పౌరులు కాగా..మ‌రొక‌రు యెమ‌న్ కు చెందిన వ్య‌క్తి. నిందితులు న‌లుగురు 30 ఏళ్ల వ‌య‌సువారేన‌ని పోలీసులు వెల్ల‌డించారు. ఈ న‌లుగురు క‌లిసి తాము పోలీసుల‌మ‌ని చెప్పి కార్మికుడి ఇంట్లోకి చొర‌బ‌డ్డార‌ని..ఆ త‌ర్వాత‌ క‌త్తుల‌తో బెద‌రించి ఇంట్లో వ‌స్తువుల‌ను దోచుకెళ్లిన్న‌ట్లు వివ‌రించారు. చోరీకి పాల్ప‌డిన న‌లుగురు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేసి త‌దుప‌రి విచార‌ణ నిమిత్తం కేసును ప‌బ్లిక్ ప్రాసిక్యూష‌న్ కు బ‌దిలీ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com