'దృశ్యం-2' షూటింగ్ పూర్తి
- April 15, 2021హైదరాబాద్: బ్లాక్ బస్టర్ మలయాళ రీమేక్ 'దృశ్యం' చిత్రానికి సీక్వెల్ గా 'దృశ్యం-2' తెరకెక్కుతోంది.మొదటి పార్ట్ లో నటించిన నటీనటులే ఈ సీక్వెల్ లోనూ నటిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్,హీరోయిన్ మీనా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న 'దృశ్యం-2' నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేశారు వెంకటేష్.చిత్రంలో వెంకటేష్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యింది.ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ ఓ పిక్ ను విడుదల చేశారు. కాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా మలయాళంలో తెరకెక్కిన 'దృశ్యం' బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.దీంతో ఈ చిత్రాన్ని దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో రూపొందించారు.అన్ని భాషల్లోనూ ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. 'దృశ్యం, దృశ్యం-2' మలయాళంలో మోహన్ లాల్ నటించగా తమిళంలో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగన్ రీమేక్ చేశారు.ఇక తెలుగులో 'దృశ్యం' చిత్రానికి ప్రముఖ నటి శ్రీప్రియ దర్శకత్వం వహించారు. అయితే 'దృశ్యం-2' తెలుగు రీమేక్ కు మాత్రం దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే 'దృశ్యం-2' ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు