భారత ఎంబసీ: హెల్త్ కేర్ వర్కర్లకు తొలి ప్రాధాన్యత
- April 15, 2021
ఖతార్: ఖతార్ లోని భారత హెల్త్ కేర్ వర్కర్లకు ప్రాధాన్యతనిస్తూ, ఇండియన్ ఎంబసీ ప్రత్యేక ఆన్ లైన్ అపాయింట్మెంట్ విధానాన్ని ప్రారంభించింది.ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది.హెల్త్ కేర్ సెక్టార్ సంబంధిత వ్యక్తులు ఎంబసీ వెబ్సైట్ ద్వారా పలు సేవలు పొందవచ్చనీ, వారికి ప్రత్యేక ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని ఎంబసీ వెల్లడించింది.తాము కోరుకున్న సమయంలో ప్రత్యేక ప్రాతిపదికన హెల్త్ కేర్ వర్కర్లకు ఇండియన్ ఎంబసీ అవకాశాలు కల్పిస్తుంది.పాస్ పోర్టు, పిసిసి మరియు ఇతర అటెస్టేషన్ సర్వీసులను హెల్త్ కేర్ వర్కర్ల కోసం ఎంబసీ ప్రత్యేక ఆన్ లైన్ అపాయింట్మెంట్ విధానం ద్వారా అందిస్తుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!









