క్రిటికల్ కోవిడ్ కేసుల్లో వ్యాక్సిన్ తీసుకోని ప్రవాసీయులే ఎక్కువ
- April 18, 2021
కువైట్ సిటీ: కోవిడ్ బారిన పడి పరిస్థితి క్రిటికల్ గా ఉన్న వారిలో ఎక్కువ మంది ప్రవాసీయులే ఉంటున్నారని కువైట్ ప్రకటించింది. వాళ్లందరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కోవిడ్ నియంత్రణ కోసం ఏర్పాటైన కువైట్ సుప్రీం అడ్వైజరీ కమిటీ చైర్మన్ వెల్లడించారు. ఆస్పత్రి పాలవుతున్న ప్రవాసీయులంతా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వారేనని ఆయన స్పష్టం చేశారు.ప్రస్తుతం నెలకొంటున్న పరిస్థితులను గమనించైనా కువైట్లోని ప్రజలు అంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన కోరారు. మెజారిటీ ప్రజలు వ్యాక్సిన్ తీసుకుంటే కోవిడ్ ను విజయవంతంగా అడ్డుకోవచ్చన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









