సన్రైజర్స్ హైదరాబాద్ పై ముంబై ఇండియన్స్ విజయం
- April 17, 2021
చెన్నై: ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ మళ్ళీ తడబడింది.151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన సన్రైజర్స్ కు అద్భుతమైన ప్రారంభాన్ని అందించారు ఓపెనర్లు. మొదటి ఆరు ఓవర్లలో 57 పరుగులు చేసి ఈ ఐపీఎల్ లో మొదటి గెలుపు పైన నమ్మకాన్ని కల్పించారు. కానీ ఆ నమ్మకాన్ని తర్వాత వచ్చిన ఆటగాళ్లు నిలబెట్టలేక పోయారు. బెయిర్స్టో(43) ఔట్ అయిన తర్వాత స్లో అయిన హైదరాబాద్ మళ్ళీ రైజ్ కాలేదు. చివర్లో విజయ్ శంకర్(28)తో కొంత ఆశ కలిగించిన అది నిరాశగానే మిగిలిపోయింది. హైదరాబాద్ బ్యాట్స్మెన్స్ అందరూ పెవిలియన్ బాట పట్టడంతో 19.4 ఓవర్లలోనే 137 పరుగులు చేసి ఆల్ ఔట్ అయ్యింది. దాంతో 13 పరుగులతేడాతో ఈ ఐపీఎల్ లో రెండో విజయాన్ని నమోదు చేసింది ముంబై.
అయితే మొదట ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ముంబై ఇండియన్స్ కు కూడా ఓపెనర్లు మంచి ఆరంభానే అందించారు. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ ను క్రీజులో కుదురుకోనివ్వలేదు హైదరాబాద్ బౌలర్లు. అయిన చివర్లో ముంబై స్టార్ హిట్టర్ పొలార్డ్(35) రాణించడంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!







