యూఏఈ చేరుకున్న భారత మంత్రి జై శంకర్, షేక్ అబ్దుల్లాతో సమావేశం
- April 19, 2021
యూఏఈ: భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, యూఏఈ చేరుకున్నారు. మినిస్టర్, ఈ సందర్భంగా షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అలాగే ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ యూఏఈ)తో కలిసి వున్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. షేక్ అబ్దుల్లాతో సమావేశం కానుండడం పట్ల ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు జై శంకర్. కాగా, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మొహమ్మద్ ఖురేషీ కూడా యూఏఈలోనే వున్నారు. భారత విదేశాంగ మంత్రితో ఎలాంటి సమావేశం వుండదని పాకిస్తన్ విదేశాంగ మంత్రి చెప్పారు. కాగా, యూఏఈతో భారతదేశానికి సన్నిహిత సంబంధాలున్నాయనీ, ఎకనమిక్ కో-ఆపరేషన్ అలాగే కమ్యూనిటీ వెల్ఫేర్ వంటి అంశాలపై యూఏఈతో భారత విదేశాంగ మంత్రి చర్చలు జరుపుతారని, విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, భారత విదేశాంగ మంత్రి అలాగే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఒకే సమయంలో యూఏఈలో వుండడం చాలా అరుదైన సంఘటన అని అధికారిక వర్గాలంటున్నాయి. కాగా, గత నవంబర్ నెలలో జై శంకర్, యూఏఈలో పర్యటించారు. షేక్ అబ్దుల్లా, జై శంకర్ ను ఢిల్లీలో ఫిబ్రవరిలో కలిశారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు









