750 టీచర్ల నియామకానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆమోదం

- April 20, 2021 , by Maagulf
750 టీచర్ల నియామకానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆమోదం

కువైట్: మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ అలీ అల్ ముదాఫ్, 750 మంది కువైటీ టీచర్ల నియామకానికి సంబంధించి ఆమోదం తెలిపారు. కరోనా పాండమిక్ కారణంగా ఈ వ్యవహారం వాయిదా పడుతూ వచ్చిందని అధికారులు తెలిపారు. స్కూళ్ళలో టీచర్ల కొరత నేపథ్యంలో వీలైనంత వేగంగా మిగతా ప్రక్రియ పూర్తి చేసి, నియామకాలు చేపట్టాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆదేశించింది. సైకాలజీ, సోషియాలజీ, హిస్టరీ, ఇస్లామిక్ ఎడ్యుకేషన్, జాగ్రఫీ మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర విభాగాలతోపాటు ఎకనమిక్స్, ఫిలాసఫీ, ఎలక్ట్రిసిటీ, జియాలజీ, ఫ్రెంచ్ లాంగ్వేజ్, బయాలజీ మరియు సైన్స్ విభాగాల్లోనూ టీచర్ల నియామకం జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com