రమదాన్ నేపథ్యంలో ఫుడ్, షిషా నిబంధనలపై స్పష్టతనిచ్చిన దుబాయ్
- April 20, 2021దుబాయ్: పవిత్ర రమదాన్ మాసంలో ఫాస్టింగ్ సమయాల్లో బహిరంగంగా షిషా, ఫుడ్ విక్రయాలు జరపకూడదని రెస్టారెంట్లు అలాగే షిషా నిర్వాహకులకు స్పష్టం చేశాయి అథారిటీస్. అయితే, వినియోగదారులకు ఫుడ్ డెలివరీస్ మాత్రం చేయవచ్చు. ఔట్ డోర్ ఏరియాస్ విషయానికొస్తే, ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సి వుంటుంది. ఉపవాస సమయాల్లో వీటిని నిర్వహించకూడదు. ఉదయం 4.20 నిమిషాల నుంచి సాయంత్రం 6.45 నిమిషాల వరకు బహిరంగ ప్రదేశాల్లో ఫుడ్, షిషా వంటివాటికి అనుమతి లేదు. రెస్టారెంట్లు వినియోగదారులకు ఫుడ్ సర్వింగ్ కోసం ప్రత్యేకంగా అనుమతులు అవసరం లేదని దుబాయ్ ఎకానమీ ఇటీవలి సర్క్యులర్ ద్వారా పేర్కొనడం జరిగింది. ఉపవాస సమయాల్లో రెస్టారెంట్లు స్క్రీన్లు వినియోగించాల్సిన అవసరం లేదని కూడా పేర్కొన్నారు. గతంలో, స్క్రీన్లు వినియోగించడం తప్పనిసరి. అటువైపుగా వెళ్ళేవారికి ఇది ఇబ్బందికరంగా మారకూడదనే కోణంలో గతంలో స్క్రీన్ల వినియోగాన్ని తప్పనిసరి చేశారు.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు