రమదాన్ నేపథ్యంలో ఫుడ్, షిషా నిబంధనలపై స్పష్టతనిచ్చిన దుబాయ్
- April 20, 2021
దుబాయ్: పవిత్ర రమదాన్ మాసంలో ఫాస్టింగ్ సమయాల్లో బహిరంగంగా షిషా, ఫుడ్ విక్రయాలు జరపకూడదని రెస్టారెంట్లు అలాగే షిషా నిర్వాహకులకు స్పష్టం చేశాయి అథారిటీస్. అయితే, వినియోగదారులకు ఫుడ్ డెలివరీస్ మాత్రం చేయవచ్చు. ఔట్ డోర్ ఏరియాస్ విషయానికొస్తే, ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సి వుంటుంది. ఉపవాస సమయాల్లో వీటిని నిర్వహించకూడదు. ఉదయం 4.20 నిమిషాల నుంచి సాయంత్రం 6.45 నిమిషాల వరకు బహిరంగ ప్రదేశాల్లో ఫుడ్, షిషా వంటివాటికి అనుమతి లేదు. రెస్టారెంట్లు వినియోగదారులకు ఫుడ్ సర్వింగ్ కోసం ప్రత్యేకంగా అనుమతులు అవసరం లేదని దుబాయ్ ఎకానమీ ఇటీవలి సర్క్యులర్ ద్వారా పేర్కొనడం జరిగింది. ఉపవాస సమయాల్లో రెస్టారెంట్లు స్క్రీన్లు వినియోగించాల్సిన అవసరం లేదని కూడా పేర్కొన్నారు. గతంలో, స్క్రీన్లు వినియోగించడం తప్పనిసరి. అటువైపుగా వెళ్ళేవారికి ఇది ఇబ్బందికరంగా మారకూడదనే కోణంలో గతంలో స్క్రీన్ల వినియోగాన్ని తప్పనిసరి చేశారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







