పంజాబ్ కింగ్స్ పై సన్రైజర్స్ హైదరాబాద్
- April 21, 2021చెన్నై: IPL 2021 లో సన్రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో మొద్దత బౌలింగ్ చేసిన సన్రైజర్స్ ప్రత్యర్థులను ఆల్ ఔట్ చేసింది. వరుస వికెట్లు తీస్తూ పంజాబ్ ను దెబ్బ కొట్టి 120 పరుగులకే కట్టడి చేసారు హైదరాబాద్ బౌలర్లు. ఇక 121 పరుగుల లక్ష్యంతో బరిలోకి వచ్చిన సన్రైజర్స్ ఆచి తూచి ఆడింది. ఓపెనర్లు వార్నర్, బెయిర్స్టో ఇన్నింగ్స్ ను కొంచెం వేగంగా ప్రారంభించిన పవన్ ప్లే తర్వాత నెమ్మదించారు. కెప్టెన్ వార్నర్ 37 పరుగుల వద్ద పెవిలియన్ చేరుకున్న విలియమ్సన్ తో కలిసి జట్టుకు విజయాన్ని అందించారు బెయిర్స్టో. ఈ క్రమంలోనే తన అర్ధశతకం కూడా పూర్తి చేసుకున్నాడు. దాంతో పంజాబ్ కింగ్స్ పైన 9 వికెట్ల తేడాతో గెలిచి ఈ సీజన్ లో మొదటి విజయం నమోదు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!