రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- May 01, 2024
మస్కట్: రవాణా, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మంగళవారం మొదటి లాజిస్టిక్స్ డేని ఘనంగా జరుపుకుంది. ఈ వేడుక లాజిస్టిక్స్ రంగంలో 2024లో అమలు చేయబోయే 6 కార్యక్రమాలను ప్రకటించారు. రెండు సంవత్సరాల పాటు మస్కట్ మరియు సలాలా నగరాలలో ప్రజా రవాణా నెట్వర్క్ ద్వారా కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించనున్నారు. అదే విధంగా లాజిస్టిక్స్ రంగంలో చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు (SMEలు) సాధికారత కల్పించడానికి ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని రూపొందించనున్నారు. ఈ కార్యక్రమంలో లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో మూడవ దశ వర్క్షాప్లు, క్లినిక్లను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా "లాజిస్టిక్స్ సెక్టార్లో బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డు" విజేతలను ప్రకటించారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్లైన్స్: కొలంబో నుండి కువైట్కు వారానికి 6 విమానాలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







