భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- May 01, 2024
యూఏఈ: ఏప్రిల్ 16న భారీ వర్షాల తర్వాత యూఏఈలోని బీమా కంపెనీలు ప్రీమియంలను 30 శాతం వరకు పెంచాయి. సమగ్ర బీమా కోసం డిమాండ్ మరియు ప్రీమియంలు కూడా పెరిగాయని, వాటిలో కొన్ని వర్షానంతర కాలంలో 100 శాతం పెరిగాయని బీమా రంగ నిపుణులు తెలిపారు. ఎందుకంటే థర్డ్-పార్టీ లయబిలిటీ (TPL) వాహనాలు, గృహాలకు సంభవించే ప్రకృతి విపత్తుల నష్టాలను కవర్ చేయదని పేర్కొన్నారు. ఖరీదైన ప్యాకేజీలను ఎంచుకోమని యజమానులకు సూచించారు. యూఏఈ 75 సంవత్సరాలలో ఏప్రిల్ 16న భారీ వర్షాన్ని నమోదు చేసింది. దీని ఫలితంగా దేశంలోని అనేక ప్రాంతాలు, ముఖ్యంగా దుబాయ్, షార్జా మరియు అజ్మాన్లలో వరదలు సంభవించాయి. కొన్ని సంస్థలు క్లెయిమ్లలో 400 శాతం జంప్ను నివేదించడంతో వర్షం సమయంలో జరిగిన నష్టాలకు వ్యతిరేకంగా బీమా కంపెనీలు వాహనం, ఇంటి క్లెయిమ్లు పెరిగిపోయాయి. యూఏఈలో బుధవారం సాయంత్రం నుండి ప్రారంభమయ్యే ఈ వారంలో మళ్లీ రెండు రోజుల పాటు మధ్యస్థం నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలు జారీ అయిన విషయం తెలిసిందే. Policybazaar.aeలో హెల్త్ అండ్ మోటర్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ తోషితా చౌహాన్ మాట్లాడుతూ.. భారీ వర్షాల తర్వాత బీమా రేట్లు 5 నుండి 20 శాతం వరకు పెరగడాన్ని తాము గమనించామని చెప్పారు. గత వారాలతో పోలిస్తే క్లెయిమ్లు దాదాపు 200 శాతానికి పైగా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. సెలూన్లు మరియు స్పోర్ట్స్/కూపే కార్లు ముఖ్యంగా ప్రీమియం పెంపుదల యొక్క అధిక ప్రభావాన్ని చూస్తాయని చౌహాన్ పేర్కొన్నారు. వర్షాల కారణంగా యూఏఈలోని కొన్ని బీమా కంపెనీలు ప్రిమియం రేట్లు పెంచాయని యూనిట్రస్ట్ ఇన్సూరెన్స్ బ్రోకర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మొయిన్ ఉర్ రెహ్మాన్ వెల్లడించారు. కాంటినెంటల్ గ్రూప్లో ఉపాధి ప్రయోజనాలు మరియు సాధారణ బీమా వైస్ ప్రెసిడెంట్ ఫైసల్ అబ్బాస్ కూడా మూడవ త్రైమాసికంలో లేదా ఈ సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ప్రీమియంలు పెరుగుతాయని స్పష్టం చేశారు. వరదల ఘటన తర్వాత సమగ్ర మోటార్ బీమా డిమాండ్ దాదాపు రెట్టింపు అయిందని అబ్బాస్ వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్లైన్స్: కొలంబో నుండి కువైట్కు వారానికి 6 విమానాలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







