ఇండియా టు యూఏఈ: ప్రయాణం నిషిద్ధం!!
- April 22, 2021
దుబాయ్: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ కొరడా విసురుతోంది. రోజురోజుకీ పరిస్థితి చేతులు దాటిపోతోంది. ఈ తరుణంలో భారత్ నుంచి వచ్చే ప్రయాణీకులపై తాత్కాలిక నిషేధం విధించింది యూఏఈ. ఈ నిర్ణయం ఏప్రిల్ 25 ఆదివారం నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ప్రయాణ నిషేధం ఏప్రిల్ 24 శనివారం రాత్రి 11.59 నుండి అమల్లోకి వస్తుంది. 10 రోజుల తర్వాత జరిగే తదుపరి సమీక్ష లో నిషేధం పై నిర్ణయం తీసుకోనుంది కాబినెట్.
అలాగే, గడిచిన 14 రోజులలో భారతదేశం గుండా ప్రయాణించిన ట్రాన్సిట్ ప్రయాణీకులు కూడా యూఏఈ ప్రవేశానికి అనర్హులు.
యూఏఈ పౌరులు, దౌత్య పాస్పోర్ట్ హోల్డర్లు మరియు అధికారిక ప్రతినిధుల పై ఈ నిషేధం వర్తించదు అని ప్రభుత్వం తెలిపింది.
అయితే, యూఏఈ నుండి భారత్ కు మాత్రం విమానాలు కొనసాగుతూనే ఉంటాయి.
తాజా వార్తలు
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..









