ఇండియా టు యూఏఈ: ప్రయాణం నిషిద్ధం!!

- April 22, 2021 , by Maagulf
ఇండియా టు యూఏఈ: ప్రయాణం నిషిద్ధం!!

దుబాయ్: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ కొరడా విసురుతోంది. రోజురోజుకీ పరిస్థితి చేతులు దాటిపోతోంది. ఈ తరుణంలో భారత్ నుంచి వచ్చే ప్రయాణీకులపై తాత్కాలిక నిషేధం విధించింది యూఏఈ. ఈ నిర్ణయం ఏప్రిల్ 25 ఆదివారం నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ప్రయాణ నిషేధం ఏప్రిల్ 24 శనివారం రాత్రి 11.59 నుండి అమల్లోకి వస్తుంది. 10 రోజుల తర్వాత జరిగే తదుపరి సమీక్ష లో నిషేధం పై నిర్ణయం తీసుకోనుంది కాబినెట్.

అలాగే, గడిచిన 14 రోజులలో భారతదేశం గుండా ప్రయాణించిన ట్రాన్సిట్ ప్రయాణీకులు కూడా యూఏఈ ప్రవేశానికి అనర్హులు.

యూఏఈ పౌరులు, దౌత్య పాస్పోర్ట్ హోల్డర్లు మరియు అధికారిక ప్రతినిధుల పై ఈ నిషేధం వర్తించదు అని ప్రభుత్వం తెలిపింది. 

అయితే, యూఏఈ నుండి భారత్ కు మాత్రం విమానాలు కొనసాగుతూనే ఉంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com