ఇండియా టు యూఏఈ: ప్రయాణం నిషిద్ధం!!
- April 22, 2021దుబాయ్: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ కొరడా విసురుతోంది. రోజురోజుకీ పరిస్థితి చేతులు దాటిపోతోంది. ఈ తరుణంలో భారత్ నుంచి వచ్చే ప్రయాణీకులపై తాత్కాలిక నిషేధం విధించింది యూఏఈ. ఈ నిర్ణయం ఏప్రిల్ 25 ఆదివారం నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ప్రయాణ నిషేధం ఏప్రిల్ 24 శనివారం రాత్రి 11.59 నుండి అమల్లోకి వస్తుంది. 10 రోజుల తర్వాత జరిగే తదుపరి సమీక్ష లో నిషేధం పై నిర్ణయం తీసుకోనుంది కాబినెట్.
అలాగే, గడిచిన 14 రోజులలో భారతదేశం గుండా ప్రయాణించిన ట్రాన్సిట్ ప్రయాణీకులు కూడా యూఏఈ ప్రవేశానికి అనర్హులు.
యూఏఈ పౌరులు, దౌత్య పాస్పోర్ట్ హోల్డర్లు మరియు అధికారిక ప్రతినిధుల పై ఈ నిషేధం వర్తించదు అని ప్రభుత్వం తెలిపింది.
అయితే, యూఏఈ నుండి భారత్ కు మాత్రం విమానాలు కొనసాగుతూనే ఉంటాయి.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..