ఏపీ కరోనా అప్డేట్

- April 22, 2021 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఏపీలో కూడా క‌రోనా సెకండ్‌ వేవ్ క‌ల్లోల‌మే సృష్టిస్తోంది.రోజురోజుకు కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.రోజువారి పాజిటివ్ కేసులు ప‌ది వేలలు దాటిపోయాయి.ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో 41,871 శాంపిల్స్ పరీక్షించగా 10,759 మందికి  కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 24 గంట‌ల్లోనే కోవిడ్‌తో 29 మంది మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది.. కోవిడ్ బారిన‌ ప‌డి చిత్తూర్ లో ఐదుగురు,కృష్ణ లో ఐదుగురు,కర్నూల్ లో ముగ్గురు, నెల్లూరు లో ముగ్గురు, ప్రకాశం లో ముగ్గురు, శ్రీకాకుళం లో ముగ్గురు, తూర్పు గోదావరి లో ఇద్దరు, గుంటూరు లో ఇద్దరు, విజయనగరం లో ఇద్దరు, అనంతపురం, వైఎస్ఆర్ కడప మరియు విశాఖపట్నం లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.ఇదే స‌మ‌యంలో 3,992 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 997462కు చేర‌గా.. యాక్టివ్ కేసులు 66944గా ఉన్నాయి.ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు 922977 క‌రోనా నుంచి కోలుకోగా 7541 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com