అమర్నాథ్ యాత్రకు కరోనా బ్రేక్
- April 22, 2021
న్యూ ఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఇప్పుడు పవిత్ర అమర్నాథ్ యాత్రను కూడా తాకింది.. అయితే, యాత్ర ప్రారంభం అయ్యేనాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కానీ.. ప్రస్తుతం అయితే రిజిష్ట్రేషన్లను తాత్కాలికంగా నిలిపివేశారు.ఈ విషయాన్ని అమర్నాథ్జీ పుణ్యక్షేత్రం బోర్డు (SASB) ప్రకటించింది.దేశంలో కరోనా పరిస్థితి దృష్ట్యా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని.. అందుకే.. అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా నిలిపివేశామని.. పరిస్థితిని పర్యవేక్షించి.. కోవిడ్ పరిస్థితులు మెరుగుపడితే.. తిరిగి ప్రారంభించడంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.
కాగా, హిమాయాల్లోని అమర్నాథ్ యాత్రను చాలా పవిత్రంగా భావిస్తారు.. కానీ, ఆ గుహకు చేరుకోవడం చాలా కష్టమైన పని.. భక్తులు వెళ్లేందుకు ప్రతి ఏటా గట్టి భద్రత మధ్య యాత్ర నిర్వహిస్తూ ఉంటారు.. బాల్తాల్ మార్గంలో జూన్ 28న, చందన్వారీ మార్గంలో ఆగస్టు 22న ప్రారంభమయ్యే ఈ యాత్ర కోసం ముందుగానే పేర్లు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తారు.. కానీ, కోవిడ్ ఎఫెక్ట్తో ఆ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది అమర్నాథ్జీ పుణ్యక్షేత్రం బోర్డు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









