భారత్ పై ట్రావెల్ బ్యాన్ విధించిన దేశాలు ఇవే..
- April 23, 2021భారత దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి పెరిగిపోయింది.భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.రోజువారీ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది.దీంతో భారత్ నుంచి తమ తమ దేశాలకు ప్రయాణికులు రాకుండా పలు దేశాలు ఆంక్షలను విధిస్తున్నాయి.కొన్ని దేశాలు అయితే ఇండియా నుంచి విమానాలను పూర్తిగా బ్యాన్ చేశాయి.
యూఏఈ, ఆస్ట్రేలియా, ఒమన్ దేశాలు భారత్ పై ట్రావెల్ బ్యాన్ విధించాయి.భారత్ నుంచి విమానాలు ఈ దేశాలకు వెళ్లడంపై నిషేధం విధించారు.భారత్ నుంచి వచ్చే విమానాలపై కెనడా 30 రోజుల నిషేధం విధించింది.
ఇక భారత్ను యూకే రెడ్ లిస్ట్లో పెట్టింది.ఈ క్రమంలో భారత్ నుంచి వచ్చే విమానాలపై యూకే నిషేధం విధించింది.గతంలో న్యూజిలాండ్ కూడా ట్రావెల్ బ్యాన్ విధించింది. ఇజ్రాయెల్ దేశం తమ దేశస్థులను భారత్, ఉక్రెయిన్, ఇథియోపియా, బ్రెజిల్, సౌతాఫ్రికా, మెక్సికో, టర్కీలకు వెళ్లకూడని హెచ్చరికలు చేసింది.అమెరికా కూడా తన పౌరులకు ఇలాంటి హెచ్చరికలే చేసింది.
ఇక మన పొరుగు దేశమైన పాకిస్థాన్ కూడా భారత్ నుంచి ప్రయాణికులు రాకుండా 2 వారాల పాటు ట్రావెల్ బ్యాన్ విధించింది.హాంగ్కాంగ్ మన దేశం నుంచి వచ్చే విమానాలపై మే 3వ తేదీ వరకు నిషేధం విధించగా సింగపూర్ లో ప్రయాణికులను 14 రోజుల వరకు క్వారంటైన్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!