సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- April 09, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్లో ఇంధన, పెట్రోకెమికల్ కేంద్రాలు, మరియు కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన దాడులను బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది.
జీసీసీ అంతటా పౌర మరియు ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు కొనసాగింపుగా ఉన్నాయని, ఇవి ప్రాంతీయ శాంతి మరియు స్థిరత్వానికి ముప్పు కలిగించే తీవ్రమైన ఉద్రిక్తతగా మంత్రిత్వ శాఖ అభివర్ణించింది.
ఇటువంటి దాడులు మంచి పొరుగు సంబంధాల సూత్రాలు, అంతర్జాతీయ చట్టం, అంతర్జాతీయ మానవతా చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని తెలియజేసింది.
సౌదీ అరేబియాకు పూర్తి సంఘీభావం ఉంటుందని, దాని సార్వభౌమత్వం, భద్రత, మరియు స్థిరత్వాన్ని కాపాడటానికి తీసుకునే అన్ని చర్యలకు పూర్తి మద్దతు ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇరాన్ దాడులను అరికట్టడానికి అంతర్జాతీయ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రకటనలో కోరారు.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!









