ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- April 10, 2026
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. విమానాశ్రయ సముదాయంలోని టెర్మినల్-1 వద్ద మంటలు చెలరేగడంతో ప్రయాణికులు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గురువారం (ఏప్రిల్ 09) సాయంత్రం టెర్మినల్ లోపల ఉన్న కేబుల్ ట్రేలు, స్విచ్ బాక్సులలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం టెర్మినల్ యొక్క గ్రౌండ్ ఫ్లోర్కే పరిమితమైనట్లు తెలిసింది. సమాచారం అందిన వెంటనే, ముంబై అగ్నిమాపక దళం, పోలీసులు, వార్డు సిబ్బంది మంటలను ఆర్పివేయడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ముంబైలోని విలే పార్లే ప్రాంతంలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 లోపల దట్టమైన పొగ కమ్ముకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. సాయంత్రం 6 గంటలకు విమానాశ్రయంలో కూర్చునే ప్రదేశంలో అగ్నిప్రమాదం జరిగింది. పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం, మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









