ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- April 10, 2026
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. విమానాశ్రయ సముదాయంలోని టెర్మినల్-1 వద్ద మంటలు చెలరేగడంతో ప్రయాణికులు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గురువారం (ఏప్రిల్ 09) సాయంత్రం టెర్మినల్ లోపల ఉన్న కేబుల్ ట్రేలు, స్విచ్ బాక్సులలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం టెర్మినల్ యొక్క గ్రౌండ్ ఫ్లోర్కే పరిమితమైనట్లు తెలిసింది. సమాచారం అందిన వెంటనే, ముంబై అగ్నిమాపక దళం, పోలీసులు, వార్డు సిబ్బంది మంటలను ఆర్పివేయడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ముంబైలోని విలే పార్లే ప్రాంతంలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 లోపల దట్టమైన పొగ కమ్ముకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. సాయంత్రం 6 గంటలకు విమానాశ్రయంలో కూర్చునే ప్రదేశంలో అగ్నిప్రమాదం జరిగింది. పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం, మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









