భారత్ నుంచి విమానాల రాకను రద్దు చేసిన కువైట్
- April 24, 2021
కువైట్ సిటీ: భారత్ లో కోవిడ్ సెకండ్ వేవ్ ఉద్ధృతి పెరగటంతో గల్ఫ్ దేశాలు అలర్ట్ అవుతున్నాయి. కువైట్ ఏకంగా భారత్ నుంచి అన్ని కమర్శియల్ విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కువైట్ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం మేరకు ఏప్రిల్ 24 శనివారం నుంచే విమానాల రద్దు అమలులోకి రానుంది. భారత్ నుంచి ఇతర దేశాల మీదుగా కువైట్ వచ్చే ప్రయాణికులు..ఆయా దేశాల్లో 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉన్న తర్వాతే దేశంలోకి అనుమతిస్తామని వెల్లడించింది. అయితే..కువైట్ పౌరులు, వారి రక్త సంబంధీకులు, డొమస్టిక్ వర్కర్లకు ఈ నిబంధన వర్తించదు. ఇదిలాఉంటే కమర్షియల్ విమానాలపై నిషేధం ఉన్నా...కార్గో విమానాలపై మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండవి..అవి యధావిధిగా కొనసాగుతాయని కూడా స్పష్టటం చేసింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









