భారత్ నుంచి బహ్రెయిన్ వచ్చే ప్రయాణిలకు కొత్త సూచనలు
- April 24, 2021
బహ్రెయిన్: భారత్ లో కోవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటంతో గల్ఫ్ దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు సంబంధించి కొత్త మార్గనిర్దేశకాలు జారీ చేస్తున్నాయి. కొన్ని దేశాలు అయితే..భారత్ పై ట్రావెల్ బ్యాన్ విధిస్తుండగా..ఇంకొన్ని దేశాలు కొన్ని జాగ్రత్తలతో ప్రయాణికులకు అనుమతి ఇస్తున్నాయి. లేటెస్ట్ బహ్రెయిన్ కూడా భారత్ నుంచి వచ్చే ప్రయాణికులతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే వారికి కొత్త సూచనలు చేసింది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మీదుగా దేశంలోకి వచ్చే వాళ్లంతా ఖచ్చితంగా కోవిడ్ పీసీఆర్ టెస్ట్ నెగటీవ్ రిపోర్ట్ కాపీని వెంట తెచ్చుకోవాలని సూచించింది. క్యూఆర్ కోడ్ ఉన్న రిపోర్ట్ ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించింది. బహ్రెయిన్ చేరుకునే 48 గంటల లోపు తీసుకున్న శాంపుల్ ఇచ్చిన రిపోర్టులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







