ఏపీ నైట్ కర్ఫ్యూ..మార్గదర్శకాల జారీ
- April 24, 2021
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
* రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
* అన్ని కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, దుకాణాలు , రెస్టారంట్లు, హోటళ్లు మూసివుంచాలి.
* ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్లు, ఫార్మసీలు, అత్యవసర సేవలందించేవి కర్ఫ్యూ సమయంలో పనిచేస్తాయి.
* ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేన్లు, ఇంటర్నెట్, కేబుల్ సేవలు, పెట్రోలు పంపులు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థల కార్యాలయాలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు.
* నీటి సరఫరా, పారిశుధ్య సేవలు, ప్రైవేటు సెక్యూరిటీ సేవలు, ఆహార సరఫరా సేవలకూ కర్ఫ్యూ నిబంధనలు వర్తించవు.
* అత్యవసర సరకు రవాణా వాహనాలు, అంతర్రాష్ట్ర సరకు రవాణాకు ఎలాంటి ఆంక్షలు లేవు.
* ప్రజా రవాణాతో పాటు ఆటోలు ఇతర వాహనాలు నిర్ణీత కర్ఫ్యూ వేళల వరకూ మాత్రమే అనుమతి ఉంటుంది.
* కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్టు కింద కఠినంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
* రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి పూట కర్ఫ్యూతో పాటు నిబంధనల అమలుకు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- Dubai sees growth in international legal consultancy firms in Q1 2026
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS









