భారత్ కు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన పాక్...

- April 25, 2021 , by Maagulf
భారత్ కు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన పాక్...

భారత్-పాక్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటోంది.జమ్మూ కాశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రెండు దేశాల మధ్య దూరం పెరిగింది.అయితే, కరోనా కాలంలో పాక్ కు ఇండియా మెడిసిన్స్, వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు ముందుకు వచ్చిన సంగతితెలిసిందే . కాగా ఇప్పుడు ఇండియాలో కరోనా మహమ్మారి రెండో వేవ్ ఉధృతంగా ఉన్నది.దీంతో ఇండియాకు సహాయం చేసేందుకు పాక్ ముందుకు వచ్చింది.వెంటిలేటర్లు, డిజిటల్ ఎక్స్ రే యంత్రాలు, పీపీఈ కిట్లు అందిస్తామని పాక్ పేర్కొన్నది.ఈ విషయాన్నీ పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.రెండు దేశాల అధికారులు ఈ విషయంలో చొరవ చూపించాలని, గొడవలు పక్కన పెట్టి మానవతావాదంతో సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పాక్ పేర్కొన్నది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com