సౌదీ నుంచి భారత్కు ఆక్సిజన్ సరఫరా
- April 26, 2021
సౌదీ: భారతదేశంలో కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు రికార్డు స్థాయిలో పెరగడం వల్ల ప్రాణాలను రక్షించే వాయువు యొక్క తీవ్రమైన కొరతను తొలగించడానికి సౌదీ అరేబియా ఆదివారం 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను భారత్కు రవాణా చేసింది.
ఈ నేపథ్యంలో గల్ఫ్,ఇతర దేశాలలోని భారతీయ దౌత్యవేత్తలు అవసరమైన ఆక్సిజన్ను కొనుగోలు చేయడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.భారతీయ నౌక, వైమానిక దళాల ద్వారా ట్యాంకర్లను పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.భారత్లో ఆక్సిజన్ కొరత తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా దిగుమతి సుంకాలు ఎత్తివేయడమే కాకుండా ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పించింది.దీంతో అదానీ గ్రూప్నకు చెందిన ఎంపీసీ అనే సంస్ధ గల్ఫ్ నుంచి ఆక్సిజన్తో పాటు.. దానిని నిల్వచేసే కంటైనర్లను కొనుగోలు చేస్తోంది. సౌదీలోని ధమామ్ నౌకాశ్రయం నుంచి గుజరాత్లోని ముంద్రాకు ఈ నెల 24న (శనివారం) 80 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన నాలుగు ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన నౌక బయలుదేరింది. ఆక్సిజన్ కొనుగోలుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోవడంలో సౌదీ ప్రభుత్వం సహాయం చేసింది. ఈ విషయాన్ని భారతీయ రాయబారి డాక్టర్ అవుసాఫ్ సయీద్ ట్విటర్లో వెల్లడించారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఇలా ట్వీట్ చేశారు: “80 టన్నుల ద్రవ ఆక్సిజన్తో 4 ఐఎస్ఓ క్రయోజెనిక్ ట్యాంకుల మొదటి రవాణా ఇప్పుడు దమ్మామ్ (సౌదీ అరేబియాలోని ఓడరేవు) నుండి ముంద్రా (పశ్చిమ రాష్ట్రమైన గుజరాత్ ఓడరేవు) కు వస్తోంది.”

సౌదీ నుంచి వచ్చే ఈ ఆక్సిజన్ను గుజరాత్లోని కచ్ జిల్లాలో పంపిణీ చేయడానికి ఏర్పాట్లు కూడా చేసినట్లగా వెల్లడించారు.దుబాయ్, మస్కట్ నగరాల నుంచీ అవసరమైన ఆక్సిజన్ను కొనుగోలు చేయడానికి భారతీయ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి, దుబాయ్, అబుధాబీలతో దాదాపు ఒప్పందాలు పూర్తి అయ్యాయి.త్వరలో భారతీయ విమానాల ద్వారా ఆక్సిజన్ సిలిండర్ కంటైనర్లను సరఫరా చేయనున్నారు. సింగపూర్ నుంచి పశ్చిమ బెంగాల్కు ఆక్సిజన్ కంటైనర్లను తరలించారు.టాటా గ్రూప్ కోసం జర్మనీ నుంచి 24 ఆక్సిజన్ రవాణా ట్యాంకర్లను కూడా భారత వైమానిక దళం తరలించింది.
తాజా వార్తలు
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!
- హౌతీ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు..!!
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా







