భారత్ లో కరోనా కేసుల వివరాలు

- April 26, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది.కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.  తాజగా దేశంలో 3,52,991 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,73,13,163కి చేరింది.ఇందులో 1,43,04,382 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 28,13,658 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 2,812 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,95,123 కి చేరింది.భారత్ లో ఇప్పటి వరకు 14,18,11,223 మందికి వ్యాక్సిన్ అందించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com