గాంధీ భవన్ లో కాల్ సెంటర్ ఏర్పాటు
- April 26, 2021
హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ సమయంలో తెలంగాణలో భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.ఈ సమయంలో..పార్టీలకు అతీతంగా ప్రజలకు అండగా ఉండాల్సిన సమయం..కోవిడ్ వ్యతిరేక పోరాటంలో మేం సైతం అంటోంది కాంగ్రెస్ పార్టీ.. కరోనా బాధితులకు అండగా..గాంధీ భవన్ లో కరోనా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.జిల్లాల్లో కూడా కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేయనున్నట్టు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.ఇక, ఇవాళ జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో జూమ్ మీటింగ్ ద్వారా పాల్గొన్న ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కరోనా బాధితులకు అండగా ఉండి.. వారికి భరోసా ఇవ్వాలని, కరోనా బాధితులతో మనో ధైర్యం నింపేందుకు కృషి చేయాలని కోరారు.
హైదరాబాద్లోని గాంధీ భవన్ లో కరోనా బాధితులకు సహాయ, సహకారాలు అందించేందుకు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ.. 040-24601254 ఈ నెంబర్ ఏర్పాటు చేసిన పార్టీ.. కరోనా బాధితులు సహాయం కోసం కాల్ చేయవచ్చని వివరించారు నేతలు.. ఈ సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో.. ప్రభుత్వాలు కనీసం ఆక్సిజన్ అందించడంలో కూడా విఫలం అయ్యాయని విమర్శించారు. నేను ముందుగానే కరోనా పరిస్థితులను వివరించినా...ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెట్టిందని ఫైర్ అయ్యారు భట్టి.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









