ఫ్లిప్కార్ట్ సమ్మర్ స్పెషల్ సేల్..
- April 26, 2021
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ సమ్మర్ స్పెషల్ బిగ్సేవింగ్ డేస్ ఆఫర్తో ముందుకొచ్చింది.ఈ ఆఫర్ మే 2న ప్రారంభమై 7వ తేదీన ముగియనున్నట్లు ప్రకటించింది. అయితే ఫ్లిప్కార్ట్ యూజర్లకు ఒక రోజు ముందుగానే అంటే మే 1వ తేదీన ఈ ఆఫర్ అందుబటులోకి రానుంది.
స్మార్ట్ ఫక్షన్లు, టీవీలు, గృహోపకరణాలపై ఈ సేల్లో భారీ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది. ముఖ్యంగా యాపిల్, వివో, శాంసంగ్, షియోమీ, ఆసుస్ ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నట్లు వెల్లడించింది.ఎలక్ట్రానిక్ ఉపకరనాలపై 80 శాతం వరకు, టీవీలపై 75 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.శాంసంగ్ గెలాక్సీ ఎక్స్ 62 ధర రూ.17,999 నుంచి ప్రారంభం కానుంది.ఎఫ్ 41 (6జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ వేరియంట్) రూ.12,999కే లభించనుంది.
పోకో ఎక్స్3 (6జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ వేరియంట్)ని రూ.14,999కి కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఐఫోన్ 11 రూ.44,999, ఆసుస్ రాగ్ ఫోన్ 3 రూ.41,999కు, ఐకూ 3 రూ.24,990కి లభించనున్నాయి. గూగుల్ పిక్సెల్ 4ఏ ధర రూ.26,999గా నిర్ణయించింది ఫ్లిప్కార్ట్.ఈ ఆఫర్లన్నింటితో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డు ద్వారా కొనుగోలు చేసినట్లయితే వారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది.అంతేకాదు ఈఎంఐలకు కూడా ఈ ఆఫర్ వర్తించనున్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది.
తాజా వార్తలు
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!
- డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక చర్యలు: సిపి రాజశేఖరబాబు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్









