జూన్ 9 వరకు ముందస్తు జాగ్రత్త నిబంధనల్ని పొడిగించిన యూఏఈ
- April 27, 2021
యూఏఈ: రస్ అల్ ఖైమా అథారిటీస్, కోవిడ్ 19 భద్రతా నిబంధనల్ని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జూన్ 8 వరకు ఈ నిబంధనలు అమల్లో వుంటాయి. పబ్లిక్ ప్రాంతాల్లో ఎక్కువమంది గుమికూడకుండా వుండడం, సోషల్ గేదరింగ్స్ వంటివాటిపై నిబంధనలు వర్తిస్తాయి. పబ్లిక్ బీచ్ అలాగే పార్కుల్లో 70 శాతం సామర్థ్యానికే అనుమతినిస్తారు. షాపింగ్ మాల్స్ 60 శాతం సామర్థ్యంతో పనిచేయాలి. పబ్లిక్ రవాణా 50 శాతం సామర్థ్యంతో నడుస్తాయి. సినిమాలు, వినోద కేంద్రాలు 50 శాతం ఆక్యుపెన్సీతోనే పనిచేయాల్సి వుంటుంది. జిమ్ అలాగే ఫిట్-నెస్ కేంద్రాలు కూడా 50 శాతం సామర్థ్యం వరకే అనుమతి. ఓ కుటుంబం అలాగే సోషల్ గేదరింగ్స్ విషయానికొస్తే 10 మందికి మాత్రమే అనుమతి. అంత్యక్రియలకు అత్యధికంగా 20 మందిని అనుమతిస్తారు. 2 మీటర్ల ఫిజికల్ డెస్టెన్సింగ్ పాటించాలి. రెస్టారెంట్లు కేఫ్స్ విషయానికొస్తే, టేబుళ్ళ మధ్య 2 మీటర్ల దూరం వుండాలి. ఒక్కో టేబుల్ పరిమితి నలుగురు వ్యక్తులకే.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







