జూన్ 9 వరకు ముందస్తు జాగ్రత్త నిబంధనల్ని పొడిగించిన యూఏఈ

- April 27, 2021 , by Maagulf
జూన్ 9 వరకు ముందస్తు జాగ్రత్త నిబంధనల్ని పొడిగించిన యూఏఈ

యూఏఈ: రస్ అల్ ఖైమా అథారిటీస్, కోవిడ్ 19 భద్రతా నిబంధనల్ని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జూన్ 8 వరకు ఈ నిబంధనలు అమల్లో వుంటాయి. పబ్లిక్ ప్రాంతాల్లో ఎక్కువమంది గుమికూడకుండా వుండడం, సోషల్ గేదరింగ్స్ వంటివాటిపై నిబంధనలు వర్తిస్తాయి. పబ్లిక్ బీచ్ అలాగే పార్కుల్లో 70 శాతం సామర్థ్యానికే అనుమతినిస్తారు. షాపింగ్ మాల్స్ 60 శాతం సామర్థ్యంతో పనిచేయాలి. పబ్లిక్ రవాణా 50 శాతం సామర్థ్యంతో నడుస్తాయి. సినిమాలు, వినోద కేంద్రాలు 50 శాతం ఆక్యుపెన్సీతోనే పనిచేయాల్సి వుంటుంది. జిమ్ అలాగే ఫిట్-నెస్ కేంద్రాలు కూడా 50 శాతం సామర్థ్యం వరకే అనుమతి. ఓ కుటుంబం అలాగే సోషల్ గేదరింగ్స్ విషయానికొస్తే 10 మందికి మాత్రమే అనుమతి. అంత్యక్రియలకు అత్యధికంగా 20 మందిని అనుమతిస్తారు. 2 మీటర్ల ఫిజికల్ డెస్టెన్సింగ్ పాటించాలి. రెస్టారెంట్లు కేఫ్స్ విషయానికొస్తే, టేబుళ్ళ మధ్య 2 మీటర్ల దూరం వుండాలి. ఒక్కో టేబుల్ పరిమితి నలుగురు వ్యక్తులకే. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com