స‌వాళ్ల‌కు ప‌రిష్కారం చెబితే ప్రైజ్‌మ‌నీ

- April 28, 2021 , by Maagulf
స‌వాళ్ల‌కు ప‌రిష్కారం చెబితే ప్రైజ్‌మ‌నీ

దుబాయ్: ఎప్పిటిక‌ప్పుడు ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఙానాన్ని అందిపుచ్చుకోటంలో పోటీప‌డుతున్న దుబాయ్ పోలీసులు..మ‌రో వినూత్న ఆవిష్క‌ర‌ణ‌తో ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చారు. ఎక్స్ ట్ర‌నల్ ఇన్నోవేష‌న్ ప్లాట్ ఫాం పేరుతో ప్ర‌జ‌ల నుంచి కూడా కొత్త ఆలోన‌లను స్వీక‌రించేలా ఓ డిజిట‌ల్ ప్లాట్ ఫాంను ఏర్పాటు చేశారు. యూఏఈ 50వ వ్య‌వ‌స్థాప‌క వార్షికోత్సంతో పాటు అంత‌ర్గ‌త మంత్రిత్వ శాఖ‌లో నిర్వ‌హిస్తున్న స్వ‌ర్ణోత్స‌వం సంద‌ర్భంగా ఇన్నోవేష‌న్ ప్లాట్ ఫాంను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వేదిక‌గా ఎవ‌రైనా ప్ర‌జ‌లు త‌మ ఆలోచ‌న‌ల‌ను, నూత‌న విధానాల‌ను పోలీసుల‌తో షేర్ చేసుకోవ‌చ్చు. అలాగే స‌వాళ్ల‌కు త‌గిన ప‌రిష్కారం చెప్ప‌వ‌చ్చు. అలా సరైన ప‌రిష్కారం చెప్పిన వారిలో ఎంపిక చేసిన వారికి Dhs25,000 ప్రైజ్ మ‌నీ ఉంటుంద‌ని దుబాయ్ పోలీసులు ప్ర‌క‌టించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com