పటికబెల్లంతో లాభాలు...
- April 28, 2021రెస్టారెంట్కి వెళ్లి భోజనం చేసినప్పుడు చివర్లో బిల్లు తెస్తూ సోంపు అందులో మిశ్రి (పటికబెల్లం పలుకులు)ఉన్న ప్లేటు తీసుకువచ్చి ముందు పెడతారు. సోంపుతో పాటు నాలుగు మిశ్రి పలుకులు కలిపి నమిలితే తిన్న ఫుడ్డు త్వరగా జీర్ణమవుతుంది. మిశ్రి పలుకులు నోరు దుర్వాసన రాకుండా తాజాగా ఉంచుతుంది. తిన్న పదార్థాలు సక్రమంగా జీర్ణమయ్యేందుకు సహరిస్తుంది. ఇది చక్కెర యొక్క రూపం కావచ్చు కానీ చెరకు సిరప్తో చేసిన ఆరోగ్యకరమైన మిఠాయి అని అంటారు.
ఇది టేబుల్ షుగర్కు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం మాత్రమే కాదు, కానీ కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. మిశ్రీ అందించే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు..
1.దగ్గు మరియు గొంతు నొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది. చల్లని వాతావరణం వివిధ ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ పరిస్థితులనుండి తక్షణ ఉపశమనం కోసం ఔషధ గుణాలు, అవసరమైన పోషకాలను మిశ్రీ కలిగి ఉంటుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా మిశ్రీని నల్ల మిరియాలు పొడి మరియు నెయ్యితో కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. గొంతు నొప్పి నివారణకు రాత్రిపూట దీన్ని తినాలి. అలాగే ఒక గిన్నెలో మిశ్రీ పౌడర్, నల్ల మిరియాలు పొడి తీసుకొని, ఒక చెంచా గోరువెచ్చని నీటితో కలపాలి. దీన్ని తీసుకుంటే వేధించే దగ్గు తగ్గుతుంది. ఇది గొంతులో ఉన్న అదనపు శ్లేష్మం బయటకు పంపించడానికి సహాయపడుతుంది.
2.మిశ్రీ హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది. తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలు రక్తహీనత, కళ్లు తిరిగినట్లు ఉండడం, బలహీనత, సాధారణ అలసట వంటి సమస్యలను కలిగిస్తాయి.మిశ్రీ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడటమే కాకుండా, శరీరంలో రక్త ప్రసరణను పునరుత్పత్తి చేస్తుంది. మిశ్రీ జీర్ణక్రియ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తాయి. కాబట్టి భోజనం తర్వాత మిశ్రీ పలుకులు కొన్ని నోట్లో వేసుకుంటే మంచిది
3.ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తుంది.
4.మిశ్రీ ముక్కులో రక్తస్రావం ఆపడానికి సహాయపడుతుంది. అలా జరిగినప్పుడు వెంటనే మిశ్రీ కలిపిన నీటిని తీసుకుంటే రిలీఫ్ వస్తుంది.అయితే మీ డైట్లో మిశ్రీని చేర్చే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
5.రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలలో మిశ్రీని కలిపి తీసుకుంటే జ్ఞాపక శక్తిని పెంచుతుంది.
6.బాలింతలు పాలు పడక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు మిశ్రి కలిపిన పాలు తీసుకుంటే పాలు పడడంతో పాటు యాంటీ డిప్రెసెంట్ గా కూడా పని చేస్తుంది. ఇందులో తీపి తక్కువ, తల్లికి దీని వల్ల ఎలాంటీ హానీ ఉండదు.
7.మిశ్రి కంటి చూపుకి బాగా పని చేస్తుంది. భోజనం తరువాత మిశ్రి చిన్నముక్కను నోట్లో పెట్టుకుంటే కంటికి మంచిది.
తాజా వార్తలు
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి