సన్రైజర్స్ హైదరాబాద్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- April 28, 2021
న్యూ ఢిల్లీ: మరోసారి సన్రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో మరో పరాజయాన్ని వేసుకుంది. ఢిల్లీ వేదికగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ తో జారొగొన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి సన్రైజర్స్ 171 పరుగులు చేసింది. జట్టు కెప్టెన్ వార్నర్(57), మనీష్ పాండే(61) అర్ధశతకాలతో మెరవగా చివర్లో విలియమ్సన్ (26) రాణించాడు. ఇక 172 పరుగుల లక్ష్యంతో వచ్చిన చెన్నై జట్టులో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (75), ఫాఫ్ డు ప్లెసిస్(56) హాఫ్ సెంచరీలు పూర్తి చేసి మొదటి వికెట్ కు 129 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పారు. అయితే 13 ఓవర్లో గైక్వాడ్ ను వెన్నకి పంపిన రషీద్ ఖాన్ ఆ తర్వాత 15 ఓవర్లో వరుసగా మొయిన్ అలీ, డుప్లెసిస్ ను ఔట్ చేసి చెన్నైని కొత్త కంగారు పెట్టాడు. అయితే అప్పటికే విజయానికి చేరువైన జట్టును రైనా, జడేజా కలిసి విజయతీరాలను దాటించారు. దీంతో చెన్నై ఐపీఎల్ 2021లో 5వ విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకోగా హైదరాబాద్ 5వ ఓటమితో చివర్లో నిలిచింది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







