సన్రైజర్స్ హైదరాబాద్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- April 28, 2021
న్యూ ఢిల్లీ: మరోసారి సన్రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో మరో పరాజయాన్ని వేసుకుంది. ఢిల్లీ వేదికగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ తో జారొగొన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి సన్రైజర్స్ 171 పరుగులు చేసింది. జట్టు కెప్టెన్ వార్నర్(57), మనీష్ పాండే(61) అర్ధశతకాలతో మెరవగా చివర్లో విలియమ్సన్ (26) రాణించాడు. ఇక 172 పరుగుల లక్ష్యంతో వచ్చిన చెన్నై జట్టులో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (75), ఫాఫ్ డు ప్లెసిస్(56) హాఫ్ సెంచరీలు పూర్తి చేసి మొదటి వికెట్ కు 129 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పారు. అయితే 13 ఓవర్లో గైక్వాడ్ ను వెన్నకి పంపిన రషీద్ ఖాన్ ఆ తర్వాత 15 ఓవర్లో వరుసగా మొయిన్ అలీ, డుప్లెసిస్ ను ఔట్ చేసి చెన్నైని కొత్త కంగారు పెట్టాడు. అయితే అప్పటికే విజయానికి చేరువైన జట్టును రైనా, జడేజా కలిసి విజయతీరాలను దాటించారు. దీంతో చెన్నై ఐపీఎల్ 2021లో 5వ విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకోగా హైదరాబాద్ 5వ ఓటమితో చివర్లో నిలిచింది.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







