కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 260 మందిని ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేసిన మినిస్ట్రీ

- April 29, 2021 , by Maagulf
కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 260 మందిని ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేసిన మినిస్ట్రీ

దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు, కోవిడ్ 19 నిబంధనల్ని ఉల్లంఘించేవారిని గుర్తించడం కోసం ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. ఈ క్రమంలో 268 ఉల్లంఘనల్ని గుర్తించారు అధికారులు. 225 మంది ఫేస్ మాస్కులు ధరించలేదని అధికారులు తెలిపారు. వాహనంలో పరిమితికి మించి ప్రయాణీకులు వున్నందుకుగాను ఒకరిపై కేసు నమోదు చేశారు. సేఫ్ ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించని 18 మందిపైనా కేసులు నమోదు చేయడం జరిగింది. బహిరంగ ప్రదేశాల్లో గుమికూడారన్న ఆరోపణలతో 9 మందిపై కేసులు పెట్టారు. క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన ఆరుగురిపైనా కేసులు నమోదు చేయడం జరిగింది. వీరందర్నీ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com