భారత్-యూఏఈ ట్రావెల్ బ్యాన్ పొడిగింపు
- April 29, 2021
యూఏఈ: భారత్ లో రికార్డ్ స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో భారత్ పై ట్రావెల్ బ్యాన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది యూఏఈ. మరో పది రోజుల పాటు అంటే..మే 14 వరకు భారత్ నుంచి విమానాలను అనుమతించబోమని స్పష్టం చేసింది.అలాగే..ఇతర దేశాల నుంచి వచ్చే వారు కూడా ప్రయాణానికి 14 రోజుల్లోపు భారత్ లో పర్యటించినట్లైతే వారికి కూడా ట్రావెల్ బ్యాన్ అంక్షలు వర్తిస్తాయి. అయితే..రెండు దేశాల దౌత్యవేత్తలు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తల విమానాలకు ట్రావెల్ బ్యాన్ వర్తించదని స్పష్టం చేసింది. అలాగే గోల్డెన్ రెసిడెన్సీ హోల్డర్స్ కి కూడా ఆంక్షలు వర్తించవు. అయితే..వీరంతా కోవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని, యూఏఈకి చేరుకోగానే పీసీఆర్ టెస్ట్ చేయించుకోవటంతో పాటు పది రోజులు క్వారంటైన్ లో ఉండాలని సూచించింది. దేశంలో అడుగుపెట్టిన నాటి నుంచి నాలుగో రోజు, ఏనిమిదో రోజు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని పేర్కొంది యూఏఈ.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







