తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

- April 30, 2021 , by Maagulf
తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

హైదరాబాద్: తెలంగాణలో రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా రాష్ట్రంలో మొదట ఏప్రిల్ 30 వరకు కర్ఫ్యూ విధించారు.అయితే రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టకపోవడం, దేశవ్యాప్తంగా పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో కర్ఫ్యూని పొడిగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం.శుక్రవారం ఈ విషయమై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం మరో వారం పాటు కర్ఫ్యూని పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.మే 1వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు కర్ఫ్యూని పొడిగిస్తూ జీవో జారీ చేశారు. ఈ కర్ఫ్యూ అమలు కోసం జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలను కట్టబెట్టారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com